తబ్లిగ్ జమాత్ ని వెంటాడుతున్న పోలీసులు, వరుసగా కేసులు…!

-

తబ్లిగ్ జమాత్ సభ్యుల పై పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసారు. కరోనా నిబంధనలు ఉల్లఘించి మర్కాజ్ లో ప్రార్థనలకు హాజరైన విదేశీయుల మీద కూడా కేసులు నమోదు చేసారు. టూరిస్ట్ విసా నిభందనలకు విరుద్ధంగా మత ప్రచార కార్యక్రమం లో పాల్గొన్నారు. హైదరాబాద్ లోని మల్లేపల్లి , బంజారాహిల్స్, ఫలక్నమా, చంద్రాయంగుట్ట, ఆసిఫ్ నగర్, హబీబ్ నగర్ లో కేసులు నమోదు చేసారు పోలీసులు.

తమ పై నమోదైన కేసులు కొట్టివేయలంటు హైకోర్ట్ ను ఆశ్రయించారు తబ్లిగ్ సభ్యులు. హైదరాబాద్ కమిషనరేట్ లో మొత్తం 7 పోలీస్ స్టేషన్ లలో వీరి పై కేసులు నమోదు అయ్యాయి. అలాగే 6 కేసుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేసారు. మరో వైపు వీరికి వస్తున్న విరాళాల మీద కూడా ఈడీ దర్యాప్తు చేస్తుంది. ముంబై, హైదరాబాద్, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో కేసులు నమోదు చేసి సోదాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version