ఏపీలో సంచలనం;వైసీపీ కార్యకర్తలు నోరు అదుపులో పెట్టుకోవాలి అన్న మంత్రి..!

-

ఆంధ్రప్రదేశ్ లో అవినీతి ఆరోపణలు ఏమో గాని ఇప్పుడు మాత్రం అధికార, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు చేస్తున్న ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయి. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని అవినీతి అస్త్రం ప్రయోగిస్తున్న అధికార పార్టీ ఇప్పుడు మరింత దూకుడు పెంచింది అనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఇటీవల ఈఎస్ఐ స్కాం విషయంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని, మంత్రి ధర్మాన కృష్ణ దాస్ కాపాడుతున్నారు అనే ఆరోపణలు వచ్చాయి.

ఈ నేపధ్యంలో మంత్రి ధర్మాన కృష్ణ దాస్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. అవినీతిలో తన పాత్ర లేదని అచ్చెన్న చెప్తే కుదరదన్న ఆయన స్కాం పై విచారణ జరుగుతుంది అన్నారు. ఎదుటి వారి మీద నోరు వేసుకుని పడిపోవడం కాదన్నారు. మా ఇంట్లో పెళ్లి అయితే వాళ్ళు వస్తారు. వాళ్ళ ఇంట్లో పెళ్లి అయితే మేము వెళ్తామని తమ స్నేహం గురించి చెప్పారు మంత్రి ధర్మాన.

మాకు వాళ్లకు లోపాయకారి ఒప్పందం ఉందనే ఆలోచన వైసీపీ కార్యకర్తలు బుర్రలో నుంచి తీసేయాలని ఆయన సూచించారు. నీతిమాలిన రాజకీయాలు చెయ్యాల్సి వస్తే రాజకీయాలు వదిలేస్తా అంటూ ధర్మాన కీలక వ్యాఖ్యలు చేసారు. కాగా మంత్రిగా అచ్చెన్నాయుడు ఉన్న సమయంలో అవినీతి జరిగింది అంటూ ప్రభుత్వం స్కాం ని బయటపెట్టిన సంగతి తెలిసిందే. దీంట్లో తన తప్పు లేదని అచ్చెన్న ఇప్పటికే స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version