రేవంత్ పాలనలో సామాన్యులపై దాడులు : బీఆర్ఎస్ నేత హరీశ్ రెడ్డి

-

సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ప్రజలపై దాడులు పెరిగిపోయానని బీఆర్ఎస్ నేత హరీశ్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో పోలీసులు సామాన్య ప్రజలపై ఇష్టారాజ్యంగా దాడులకు తెగబడుతున్నారని ఫైర్ అయ్యారు. గతంలో కేసీఆర్ పాలనలో ఏనాడు పోలీసులు సామాన్యులపై చేయి వేయలేదని గుర్తుచేశారు.గత బీఆర్ఎస్ పాలనలో ఉన్న ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ఇప్పటి పోలీసుల తీరుకు చాలా తేడా ఉందన్నారు.

పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో 1వ పట్టణ పోలీస్‌స్టేషన్ సీఐ ఇంద్రసేనారెడ్డి బలుపెక్కిన వేషాలు వేస్తుండు. రాత్రి 10 తర్వాత దుకాణం తెరిచి ఉంచాడని కొబ్బరి కాయలు అమ్మే వ్యాపారిని దుర్బాషలాడుతూ సీఐ చేయిచేసుకున్నాడు. వెంటనే సదరు సీఐపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి ‘ఎక్స్’ ద్వారా ట్యాగ్ చేశారు బీఆర్ఎస్ నేత హరీశ్ రెడ్డి. ఇదే విషయంలో రామగుండం కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ కావాలని సీఐని గోదావరిఖనికి తీసుకొచ్చారని కూడా వీడియో సందేశంలో హరీశ్ రెడ్డి ప్రస్తావించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version