చేనేత కుటుంబాలకు పుట్టినరోజున‌ జగన్ వరాలు..

-

పుట్టినరోజు సందర్భంగా సీఎం జగన్.. చేనేత కుటుంబాలకు వరాల జల్లు కురిపించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని సీఎం ప్రారంభించారు. మగ్గం ఉన్న ప్రతీ నేతన్న కుటుంబానికి ఏడాదికి రూ.25వేల రూపాయలు అందిస్తామన్నారు. ఈ పథకం నేతన్నలు కుటుంబాలు గౌరవంగా బతికేందుకు ఉపయోగపడతాయన్నారు. అకౌంట్లలో పడే డబ్బులు బకాయిలు కింద జమ చేసుకోకుండా బ్యాంకులకు ఆదేశాలిచ్చామన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 81వేల చేనేత కుటుంబాలకు ఈ పథకం కింద నగదు పంపిణీ చేస్తున్నామన్నారు సీఎం. నేతన్నలకు ఓ చరిత్ర ఉందన్నారు. ధర్మవరం చేనేతలు గురించి ప్రపంచ వ్యాప్తంగా చెప్పుకుంటారన్నారు. పాదయాత్రలో చేనేత కార్మికుల కష్టాల్ని చూశానన్నారు. ధర్మవరం చేనేతలు గురించి ప్రపంచ వ్యాప్తంగా చెప్పుకుంటారన్నారు. ధర్మవరం చేనేతకార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news