ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునే ప‌నిలో ప్ర‌శాంత్ కిశోర్…!

-

స‌మ‌కాలీన రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న క‌లిగిన ఒక సామాన్యుడు పొలిటిక‌ల్ పార్టీ పెడితే ఎలా స‌క్సెస్ కావ‌చ్చో నిరూపించారు ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్. ఎదుర్కొన్న తొలి ఎన్నిక‌ల్లోనే ప్ర‌భంజ‌నం సృష్టించి ఢిల్లీ పీఠాన్ని అధిరోహించారాయ‌న‌. వ‌రుస‌గా రెండుసార్లు ఢిల్లీ ముఖ్య‌మంత్రిగా ఎంపిక‌య్యారు. ఇప్పుడు ఆయ‌న త‌ర‌హాలోనే రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు ప్ర‌ముఖ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్‌కిశోర్‌. త్వరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే పలు పార్టీలకు చెందిన నేతలు ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ప్ర‌శాంత్‌ కిషోర్‌ కూడా అప్పుడే ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్రచార సభలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఒక్క గంటలోనే సంపూర్ణ మద్యపానం అమల్లోకి తెస్తానని హామీ ఇచ్చారు. ఆయన ఇటీవల జన్ సూరజ్ పార్టీ ఏర్పాటు చేసి, రాష్ట్రంలో తదుపరి జరిగే ఎన్నికలకు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

అక్టోబరు 2న తమ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కోసం ప్రత్యేక ప్రణాళికల గురించి ప్రశ్నించగా.. అందుకు ప్రత్యేక సన్నాహాలు అవసరం లేదన్నారు. గత రెండేళ్లుగా మేం సిద్ధమవుతున్నాం.. జన్ సూరజ్ ప్రభుత్వం ఏర్పడితే ఒక్క గంటలోగా మద్య నిషేధానికి ముగింపు పలుకుతామన్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అమలవుతున్న మద్యనిషేధ విధానాన్ని నకిలీగా అభివర్ణించారు ప్ర‌శాంత్ కిశోర్‌.

న‌కిలీ మ‌ద్యంతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నార‌ని చెప్పిన ప్రశాంత్ కిశోర్‌…. మద్య నిషేధం వల్ల పేద‌ల‌ను కాపాడుకోవ‌చ్చ‌ని అన్నారు. ఇక మ‌ద్యం నిషేధం వ‌ల‌న ప్రతీ ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.20,000 కోట్ల వ‌స్తుంద‌ని.. అయితే మద్యం మాఫియా, అధికారులు మాత్రం అక్రమ వ్యాపారాల ద్వారా అడ్డగోలుగా డబ్బు సంపాదిస్తున్నారని ఆయన అన్నారు. ఈ విధానానికి తాను వ్యతిరేకినని చెప్తూ మహిళల ఓటు బ్యాంకును కోల్పోతామన్న భయం లేదని అన్నారు.

త‌న‌కు మహిళల ఓట్లు వచ్చినా, రాకపోయినా, మద్య నిషేధానికి వ్యతిరేకంగా మాట్లాడటం కొనసాగిస్తాన‌న్నారు పీకే.బీహార్ వంటి రాష్ర్టానికి మ‌ద్య నిషేధం వ‌ల‌న ఎలాంటి న‌ష్టం ఉండ‌బోద‌ని తేల్చిచెప్పేశారు. ప్ర‌శాంత్ కిశోర్ వ్యాఖ్య‌లు బీహార్‌లో ఇప్ప‌డు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ర్టంలో ప‌నిచేసిన ముఖ్య‌మంత్రుల‌కు మ‌ద్య‌నిషేధం సాధ్యం కాలేదా అని పీకేను ఉద్దేశించి సెటైర్లు వినిపిస్తున్నాయి.అధికార పీఠం కోసం పీకే కూడా సాధ్యంకానీ హామీలు మొద‌లెట్టేశార‌ని కామెంట్లు వ‌స్తున్నాయి

అధికార‌మే ల‌క్ష్యంగా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్న పీకే…పొలిటిక‌ల్ సీనియ‌ర్‌ల‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. 2016 నుంచి బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్‌పై నిప్పులు చెరిగారు. నితీష్‌ సర్కార్‌ అమలు చేస్తున్న మద్యపాన నిషేధంపై కిషోర్ విమర్శలు గుప్పించారు. మరణానికి, అజ్ఞానాంధకారానికి దారి తీసే మద్యాన్ని నియంత్రించడంలో సీఎం పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. తేజస్వి యాదవ్, నితీష్ కుమార్ ఇద్దరూ బీహార్ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని ప్రశాంత్ కిషోర్ విమర్శించారు.

ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సమస్యంతా నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ మధ్య ఉందని, ఎవరు ఎవరికి క్షమాపణలు చెప్పారనేది ముఖ్యం కాదంటూ ఇద్దరూ బీహార్‌కు నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. బీహార్ ప్రజలు 30 ఏళ్లుగా వారిద్దరినీ చూస్తున్నారు. వారిద్దరూ బీహార్ విడిచి వెళ్లాలని మేమంతా కోరుతున్నామని చెప్ప‌డం సంచ‌ల‌నంగా మారింది. మొత్తానికి త‌న వ్యాఖ్య‌ల‌తో బీహార్ రాజ‌కీయాల‌ను హాట్‌గా మార్చేస్తున్నారు ప్ర‌శాంత్ కిశోర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version