నిమజ్జనం కోసం వచ్చే ప్రజలు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లలో రావాలి : సీపీ ఆనంద్

-

హైదరాబాద్ లో ప్రశాంతంగా వినాయక నిమజ్జనం జరుగుతుంది. గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ లో ఉన్న విగ్రహాలు త్వరగ నిమజ్జనం అయ్యేలా చూస్తున్నాం అని హైదరాబాద్ సీపీ ఆనంద్ పేర్కొన్నారు. గత ఏడాది లాగా ఆలస్యం కాకుండా చర్యలు తీసుకున్నాం. మండప నిర్వాహకులతో మాట్లాడి నిమజ్జనం జరిగేలా చూస్తున్నాం. బాలాపూర్ వినాయకుడు కూడా త్వరగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నాం. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రణాళికలు సిద్ధం చేశాము.

షిఫ్ట్ వారిగా 25 వేల మంది పోలీసులు బందోబస్తూ ఏర్పాటు చేశాము. నిమజ్జనం లో పోలీసులు అలసిపోకుండా షిఫ్ట్ లు ప్రకారం డ్యూటీ చేస్తున్నారు. లక్ష విగ్రహాలు సిటీలో ఉండొచ్చు, 20 నుండి 30 వేలు విగ్రహాలు పెండింగ్ ఉన్నాయి. రేపు ఉదయం లోగా నిమజ్జనం మొత్తం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. గత ఏడాది లాగా కాకుండా ఏడాది త్వరగా నే నిమజ్జనం అయ్యేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. నిమజ్జనం కోసం వచ్చే ప్రజలు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లలో రావాలని కోరుతున్నాం. లేదంటే మీడియా లో వచ్చే లైవ్ టెలికాస్ట్ చూడాలని ప్రజలను కోరుకుంటున్నాము అని సీపీ ఆనంద్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version