ప‌వ‌న్ దీక్ష చేయ‌డం కంటే ప్ర‌ధాని పై ఒత్తిడి తీసుకురావాలి : మంత్రి క‌న్న‌బాబు

-

విశాఖ ఉక్కు ప్లాంట్ పై జనసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ దీక్ష చేయ‌డం కంటే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ పై ఒత్తిడి తీసుకురావాల‌ని ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి క‌న్న‌బాబు అన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ దీక్ష‌లు చేయ‌డం వ‌ల్ల లాభం లేద‌ని అన్నారు. విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ ను ప్ర‌యివేటీ క‌ర‌ణ చేయ వద్ద‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఆడ‌గాల‌ని అన్నారు. అలాగే ప్ర‌త్యేక హోదా అంశం కూడా టీడీపీ అధినేత చంద్ర బాబు వ‌ల్లే తెర ప‌డింద‌ని విమ‌ర్శించారు.

ప్రత్యేక హోదా వ‌ద్ద‌ని ప్యాకేజీ లు కావాల‌ని చంద్ర బాబు సీఎం గా ఉన్న స‌మ‌యంలో చెప్పార‌ని అన్నారు. అందుకే ఆంధ్ర ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక ప్యాకేజీలు తీసుకు వ‌చ్చాడ‌ని అన్నారు. ఆనాటి ప్ర‌త్యేక ప్యాకేజీ వ‌ల్లే నేడు ఆంధ్ర ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోద రావ‌డం లేద‌ని విమ‌ర్శించాడు. అలాగే త‌మ ప్ర‌భుత్వం 1.30 ల‌క్ష‌ల మందికి ఉద్యోగాల‌ను ఇచ్చామ‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news