టీఆర్ఎస్ కు షాక్ .. మాజీ మేయ‌ర్ రాజీనామా

-

అధికార టీఆర్ఎస్ పార్టీ కి క‌రీంన‌గర్ మాజీ మేయ‌ర్ స‌ర్దార్ ర‌వీంద‌ర్ సింగ్ షాక్ ఇచ్చాడు. టీఆర్ఎస్ పార్టీ ప్రాథ‌మిక స‌భ్యత్వానికి క‌రీంన‌గ‌ర్ మాజీ మేయ‌ర్ స‌ర్దార్ ర‌వీంద‌ర్ సింగ్ రాజీనామ చేశాడు. త‌న రాజీనామ లేఖ ను గులాబీ బాస్ సీఎం కేసీఆర్ కు స‌ర్దార్ ర‌వీంద‌ర్ సింగ్ పంపించాడు. ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్ లో ఉద్య‌మ ద్రోహుల కే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని సీఎం కేసీఆర్ కు రాసిన‌ లేఖ లో స‌ర్దార్ ర‌వీంద‌ర్ సింగ్ అన్నాడు.

తెలంగాణ ఉద్యమ కాలంలో పార్టీ కోసం, రాష్ట్ర సాధ‌న కోసం పోరాడిన వారిని ప‌క్కన పెడుతున్నార‌ని అన్నారు. కాగ మాజీ మేయ‌ర్ క‌రీంన‌గర్ 51 వ డివిజ‌న్ కార్పొరేట‌ర్ స‌ర్దార్ ర‌వీంద‌ర్ సింగ్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల లో ఇండిపెండెంట్ గా నామినేష‌న్ వేశాడు. అప్ప‌టి నుంచే ఆయ‌న టీఆర్ఎస్ ను వీడుతున్నారు అనే ఉహా గ‌ణాలు వ‌చ్చాయి. కాగ రవీంద‌ర్ సింగ్ టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ టికెటు ను ఆశించాడు. కానీ క‌రీంన‌గ‌ర్ నుంచి ఎల్ ర‌మ‌ణ కు, భాను ప్ర‌కాశ్ ల‌ను ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు గా టీఆర్ఎస్ ప్ర‌క‌టించింది. దీంతో స‌ర్దార్ ర‌వీంద‌ర్ సింగ్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news