గన్నవరం లోకేష్ జోరు..కానీ తమ్ముళ్లతో డ్యామేజ్.!

-

లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. విజయవాడ నగరం, పెనమలూరు నియోజకవర్గాల్లో పాదయాత్ర ముగించుకున్న లోకేష్..గన్నవరంలో పాదయాత్ర కొనసాగించారు. అక్కడ తాజాగా భారీ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు కృష్ణా జిల్లా తమ్ముళ్ళు పెద్ద ఎత్తున వచ్చారు. టి‌డి‌పి నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇక వారు ఆద్యంతం కొడాలి నాని, వల్లభనేని వంశీలనే టార్గెట్ చేశారు..ఎందుకంటే వారు ఏ స్థాయిలో చంద్రబాబు, లోకేష్ లపై విరుచుకుపడతారో చెప్పాల్సిన పని లేదు. అందుకే వారి టార్గెట్ గా తమ్ముళ్ళు రెచ్చిపోయారు. అయితే సభకు భారీగానే టి‌డి‌పి శ్రేణులు వచ్చాయి. లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు.. వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు జరుగుతున్నాయని, కృష్ణా లో జరిగే అక్రమాలు అంటూ లోకేష్ ఫైర్ అయ్యారు. ఇక తన తల్లిని అసెంబ్లీ సాక్షిగా అవమానించిన వంశీ, కొడాలి పరిస్తితి రేపు టి‌డి‌పి అధికారంలోకి వచ్చాక ఎలా ఉంటుందో చెబుతానని వార్నింగ్ ఇచ్చారు.

ఇలా గన్నవరంలో టి‌డి‌పి సభ ఉత్సాహంగానే సాగింది..కానీ అనూహ్యంగా తెలుగు తమ్ముళ్ళు నోరు పారేసుకోవడం సంచలనంగా మారింది. ఇప్పటికే టి‌డి‌పి, వైసీపీ నేతల మధ్య బూతుల యుద్ధం జరుగుతుంది. ఈ తరుణంలో టి‌డి‌పి నేతలు..గన్నవరం సభ సాక్షిగా జగన్ తో సహ కీలక నేతలని బూతులు తిట్టారు.

జగన్, కొడాలి నాని, వంశీ, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  టి‌డి‌పి నేతలు అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమా,బోండా ఉమా, బుద్దా వెంకన్న లాంటి వారు..బూతులు తిట్టారు. ఇక వీరికి వైసీపీ నుంచి ఎలాంటి కౌంటర్లు వస్తాయో చూడాలి. టి‌డి‌పి నేతల తిట్లపై సొంత పార్టీ శ్రేణులే అవాక్కయే పరిస్తితి. సభ సక్సెస్ అయితే.దాన్ని తిట్లతో పక్కదోవ పట్టించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version