జగన్ గూబ పగలగొట్టారు: వైసీపీ ఎంపీ

-

వైసీపీ నేతలకు మానసిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యాఖ్యానించారు. జగతి పబ్లికేషన్ కేసులో ముగ్గురు ప్రముఖులు జైలుకు వెళ్లే అవకాశం ఉందని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. సీబీఐ దాడులంటూ తనపై దుష్ప్రచారం చేశారని, సాక్షి పత్రిక, టీవీపై పరువు నష్టం దావా వేస్తానని స్పష్టం చేసారు. దీనిపై న్యాయవాదితో సంప్రదించినట్లు చెప్పిన ఆయన… పిచ్చివాళ్లతో ప్రభుత్వాన్ని నడిపించాలనుకోవడం మంచిది కాదని సూచించారు.

వైవీ సుబ్బారెడ్డి అవినీతిపై ప్రధాని మోదీకి లేఖ రాశాను అని అన్నారు. రంగుల విషయంలో న్యాయస్థానాలు సీఎం జగన్ గూబ పగులగొట్టాయని ఆయన పేర్కొన్నారు. ఓట్లు కావాల్సినప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలు కావాలని.. గెలిచాక శిరోముండనాలు, దాడులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఏడుకొండలు.. ఏడు రెడ్లు అన్నట్లు తిరుమల తయారైందని రఘురామ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version