ప్రజా వేదిక కార్యక్రమం వాయిదా… అధికారికంగా ప్రకటించిన పార్టీ నాయకులు

-

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ శనివారం అంటే 6 వ తేదీన నిర్వహించనున్న ప్రజా వేదిక కార్యక్రమం వాయిదా పడింది. గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రతి శనివారం ప్రజా సమస్యలు వినడంతో పాటు వినతులు స్వీకరించాల్సిన నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.

 

ప్రజా వేదిక పేరుతో ఇప్పటికే రెండు శనివారాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా ఈసారి మాత్రం అనూహ్యంగా వాయిదా పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ నేపథ్యంలో శనివారం ప్రజా వినతులను స్వీకరించడంలేదని పార్టీ నాయకులు ప్రకటించారు. ఈ శనివారం కాకుండా పై వచ్చే వారంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా వేదిక కార్యక్రమాన్ని కొనసాగించనున్నారని , ఈ నెల 6న తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ప్రజలు రావొద్దని పిలుపునిచ్చారు. కాగా సీఎం చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులను రేపు కలవనున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు ప్రధాని మోడీతో ఆ తర్వాత కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్నారు. అమరావతి, పోలవరం, ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రధానితో పాటు కేంద్రమంత్రులకు సీఎం చంద్రబాబు నివేదిక అందించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version