లోక్ సభ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ దిష్టి పోయింది: కేసీఆర్

-

లోక్ సభ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ దిష్టి తీసినట్టయిందని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు.ఈరోజు ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో మేడ్చల్, మహాబూబాబాద్,నల్గొండ జిల్లాల నుంచి వచ్చిన కార్య కార్యకర్తలు నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్…ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని ,కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక పలురకాల జిమ్మిక్కులతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నదనిఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ కు ఓటేసి పొరపాటు చేశామని నాలిక కరుసుకుంటున్నారని అన్నారు. తిరిగి పునరుత్తేజంతో మరింతగా ప్రజాదరణను కూడగట్టాలని,కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు తిరుగబడే రోజులు త్వరలోనే రానున్నాయని తెలిపారు. మరికొన్ని రోజుల్లోనే టార్చ్ లైట్ పట్టుకొని జనం దోలాడుకుంటా బీఆర్ఎస్ కోసం వస్తారని ,అప్పడిదాక ఓపికతో ప్రజా సమస్యలపైన పోరాడుతూ వారికి అందుబాటులో వుండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.వారానికి రెండు నియోజకవర్గాల పేర్లు చెబుతాం… చెప్పిన వాళ్లు మాత్రమే వస్తే లొల్లి లేకుంట వాళ్లతో కడుపునిండ మాట్లాడి పంపిస్తానని కేసీఆర్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version