ప్రభాస్‌ ‘ఆది పురుష్‌’ టీజర్‌ టాక్‌… ఆ షాట్ హైలైట్ అట!

-

ప్రభాస్‌ కథానాయకుడి ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఇతిహాసగాథ ‘ఆదిపురుష్‌’. రామాయణం ఇతివృత్తంగా తీర్చిదిద్దుతున్న ఈ మూవీ టీజర్‌ టాక్‌ ఎలా ఉందంటే?

ప్రభాస్‌ హీరోగా ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఇతిహాసగాథ ‘ఆదిపురుష్‌’. రామాయణం ఇతివృత్తంగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. దసరా కానుకగా ఆదివారం ‘ఆదిపురుష్‌’ టీజర్‌ను అయోధ్య వేదికగా విడుదల చేస్తున్నారు. 1.40 నిమిషాల పాటు సాగే టీజర్‌ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయబోతోంది.

రాముడిగా ప్రభాస్ కనిపించిన తీరు చాలా బాగుందని సమాచారం. ముఖ్యంగా నీళ్లలో తపస్సు చేస్తూ కూర్చున్న షాట్ టీజర్‌కే హైలైట్‌గా నిలవనుందట. టీజర్‌లో కనిపించిన విజువల్స్‌ చూస్తుంటే సినిమాను అద్భుతమైన విజువల్ వండర్‌గా తీర్చిదిద్దినట్లు తెలుస్తోందని అంటున్నారు.

రామసేతుపై రాముడిగా ప్రభాస్ నడుచుకుంటూ వచ్చిన సీన్, లంకేశ్‌గా సైఫ్ అలీఖాన్ క్రూరత్వం, రాక్షసులను డిజైన్ చేసిన విధానం మెప్పిస్తుందట. సీత పాత్రలో నటించిన కృతిసనన్‌తో పూల తోటలో ఊయలలూగే షాట్ కలర్ పుల్‌గా ఉందని టాక్‌. హనుమంతుడిగా దేవదత్త నాగే, లక్ష్మణుడిగా సన్నీసింగ్ అదరగొట్టారని అంటున్నారు. సాచేత్‌ తాండన్‌- పరంపరా ఠాకూర్‌ నేపథ్య సంగీతం టీజర్‌కు మరింత వన్నె తెచ్చినట్లు తెలుస్తోంది.

‘అధర్మం, అన్యాయం పదితలలుగా విలసిల్లుతున్న సమాజంలో న్యాయం రెండు పాదాలతో నడుచుకుంటూ(రాముడు) రూపంలో అధర్మాన్ని సంహరిస్తుంది’ అని డైరెక్టర్ ఓంరౌత్ ‘ఆదిపురుష్’ రూపంలో చెప్పబోతున్నట్లు అర్థమవుతోంది. ‘ఆదిపురుష్’లో రామ-రావణ యుద్ధం ప్రేక్షకులకు కనువిందు చేయడం ఖాయం. హాలీవుడ్ స్థాయి సినిమా లక్షణాలు ‘ఆదిపురుష్’లో పుష్కలంగా కనిపిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో ‘ఆది పురుష్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version