నా వల్లే సూర్య గ్రహణం ఆలస్యం.. నిత్యానంద స్వామి వీడియో షేర్ చేసిన ప్రకాష్ రాజ్

-

వివాదాస్పద స్వామీజీ నిత్యానంద గురించి తెలియని వారు ఉండరు. కైలాస పేరుతో ఏకంగా దేశాన్నే ఏర్పాటు చేసినట్లు ఇటీవల నిత్యానందస్వామి ప్రకటించారు. అంతటితో ఆగక గత వినాయకచవితి సందర్భంగా కైలాస దేశానికి రిజర్వు బ్యాంకును కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కైలాస దేశానికి సంబంధించిన నాణాలను కూడా ఆయన విడుదల చేశారు.

ఆర్ బి కె నాణేలు బంగారంతో.. చేసినవా అని ఈ సందర్భంగా నిత్యానందస్వామి తెలిపారు. అయితే తాజాగా నిత్యానంద స్వామీజీ ఇటీవల మాట్లాడిన వీడియోను ప్రకాష్ రాజ్ తన ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. తాను సూర్యుణ్ణి కాస్త ఆలస్యంగా తాను రమ్మన్నారని… అందుకే కైలాస లో సూర్యుడు చాలా ఆలస్యంగా వస్తున్నాడంటూ నిత్యానంద స్వామిజీ మాట్లాడిన ఓ వీడియోను ప్రకాష్ రాజు విడుదల చేశారు.

” తాను ధ్వజారోహణం చేసేంతవరకు సూర్యుని 40 నిమిషాలు ఆలస్యంగా రమ్మన్నాను. అందుకే కైలాస లో సూర్యుడు 40 నిమిషాలు లేటుగా వస్తాడు. దీనికి కారణం నేనే ” అంటూ నిత్యానంద స్వామి పేర్కొన్నారు. అయితే ఈ వీడియో ను టార్గెట్ చేస్తూ… కైలాస లో భారీ మెజారిటీతో నువ్వు గెలుస్తావ్ అంటూ నిత్యానందపై కామెంట్ చేశాడు ప్రకాష్ రాజ్. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు ప్రకాష్ రాజు పై మండి పడుతున్నారు. నిన్న బిజేపి విజయాన్ని జీర్ణించుకోలేక ఇలాంటి వీడియోలు పెడుతున్నాడు అంటూ అసభ్యకర పోస్టర్లతో ప్రకాష్ రాజ్ పై ఫైర్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version