ప్రవళిక, అహ్మద్ వి బీఆర్ఎస్ ప్రభుత్వ హత్యలే : అమిత్ షా

-

డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే తెలంగాణ వేగంగా అభివృద్ధి జరుగుతుందని కేంద్ర హోమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
బీఆర్ఎస్ కి వీఆర్ఎస్ ఇచ్చే సమయం వచ్చింది అని తెలిపారు. పేపర్ లీకేజ్ కారణంగా ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది. 4 శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని తెలిపారు హోంమంత్రి. బీఆర్ఎస్ టైమ్ అయిపోయిందని తెలిపారు. అబద్ధపు మాటలతో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తి చేయలేదు. బీసీలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో టికెట్లు ఇవ్వలేదు. బీజేపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుంది.

ఉద్యోగాల పేరిట సీఎం కేసీఆర్ యువతను మోసం చేశారని ఆరోపించారు. TSPSc నుంచి 7 నోటిఫికేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి.. ప్రశ్నపత్రాలను లీక్ చేశారు. అలాంటి ఘటనల వల్ల ప్రవళిక, అహ్మద్ వంటి యువత ఆత్మహత్య చేసుకున్నారు. అవి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన హత్యలేనని.. బీజేపీ అధికారంలోకి వస్తే.. ఐదేళ్లలో 2.5లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు పారదర్శకంగా భర్తి చేస్తమాని అమిత్ షా వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version