ప్రాణం తీసిన ఫోటో షూట్..కాబోయే వధూవరుల మృతి

-

కర్నాటకలో విషాదం జరిగింది. ప్రి వెడ్డింగ్‌ ఫొటో షూట్‌… కాబోయే వధూవరుల ప్రాణాలు తీసింది. మైసూర్‌కు చెందిన చంద్, శశికళకు ఇటీవలే నిశ్చితార్థం జరిగింది.. కార్తీక మాసలో వీరికి పెళ్లి జరగనుంది. ఇందులో భాగంగా తమ ప్రి వెడ్డింగ్ ఫొటో షూట్ ను వినూత్నంగా ప్లాన్‌ చేశారు. నీటిలో బోట్ పైన నిలబడి ఇద్దరూ ఫొటోలకు స్టిల్ ఇచ్చారు. ఫొటోగ్రాఫర్ స్టిల్స్ తీస్తుండగానే.. బోట్ నీటిలో బోల్తా పడింది. దీంతో కాబోయే భార్యభర్తలిద్దరూ నీటిలో మునిగిపోయారు.

ఫోటో షూట్ వారి కలలను చిదిమేసింది. జీవితాంతం పదిలంగా దాచుకుందామనుకుకన్న ఫొటోషూట్‌.. చివరకుక వారి ప్రాణాల్నే తీసింది. మైసూర్ లో ఓ అందమైన బోట్ షికార్ దగ్గర ఫొటో షూట్ కోసం వెళ్లిన జంట.. నీటమునిగి ప్రాణాలు విడిచింది. కర్ణాటక మైసూరు జిల్లా క్యాతమారనహళ్లికి చెందిన చంద్ర,శశికళలకు ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. తలకాడులో ఏర్పాటు చేసిన ప్రీవెడ్డింగ్‌ షూట్‌ లో భాగంగా.. ఫొటోలు తీసుకునేందుకు తెప్పలో వెళ్తుండగా అనుకోని ప్రమాదం జరిగింది. తెప్ప బోల్తా పడటంతో.. ఇద్దరూ నీటమునిగారు. ఈనెల 22న వీరి వివాహం జరగనుంది. ఇద్దరూ కలిసి తలకాడులోని కావేరి నదిలో తెప్పలో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. భార్యభర్తలు కావాల్సినవారు.. విగతజీవులుగా మారడంతో ఇరువైపు కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి.కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version