ఆ యాక్సిడెంట్ నన్ను నాశనం చేసింది: ప్రీతిజింటా

-

డింపుల్ గర్ల్ గా మంచి పేరు తెచ్చుకుంది ప్రీతిజింటా. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు భాషాతో సంబంధం లేకుండా దాదాపు అందరి హీరోలతో కూడా నటించింది ఈరోజు ఈమె పుట్టినరోజు. 49 ఏళ్ళని పూర్తి చేసుకుంది ప్రీతిజింటా ఇంత ఫేమ్ సంపాదించుకున్న ఈమె ఎప్పుడూ కూడా తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు బయటపెట్టలేదు. ప్రీతి బాల్యం ఎప్పటికీ మర్చిపోలేనిది. చాలా భయంకరంగా జరిగిందట. 

13 ఏళ్ల వయసులో ఆమె ఒక కారు ప్రమాదం జరిగింది. తన తండ్రి దుర్గానంద ఆ కారు ప్రమాదంలో చనిపోయారు. తన తల్లి కూడా అదే కారులో ఉన్నారు ఈ ప్రమాదంలో ఆమె తల్లికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం తర్వాత ఆమె తల్లి రెండేళ్లుగా మంచం పైనే ఉన్నారట. కానీ ప్రీతికి 15 ఏళ్లు వచ్చేసరికి ఆమె చనిపోయింది. తల్లిదండ్రులు పోయిన బాధ నుండి బయటికి వచ్చి హీరోయిన్ అవ్వాలని ప్రయత్నం చేసింది అలా అవకాశాలు వచ్చాయి..

Read more RELATED
Recommended to you

Latest news