రాష్ట్రపతిని కలిసిన ప్రధాని నరేంద్ర మోడీ..!

-

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు 7 దశల్లో జరిగాయి. నిన్న ఎన్నికలకు సంబంధించి ఫలితాలు లభించాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ మరో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాజాగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రధాని నరేంద్ర మోడీ కలిసారు.

రాష్ట్రపతిని కలిసి 17వ లోక్ సభను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈనెల 08న 18వ లోక్ సభకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు ఇవాళ సాయంత్రం ప్రధాని మోడీ నివాసంలో ఎన్డీఏ కూటమి నేతలు భేటీ కానున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు. ఎన్డీఏ సమావేశంలో పలువురు కీలక నేతలు పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version