పోప్ కు ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మీయ ఆలింగనం

-

ఇటలీలో జరుగుతున్న జీ 7 సమ్మిట్ కు అగ్ర నేతలంతా హాజరైనారు.దీంతో ఒకరినొకరు పలకరించుకుంటూ ఉత్సాహంగా సాగుతున్నారు.ఇక ప్రధాని నరేంద్ర మోడీ.. ఆయా దేశాధినేతలతో సమావేశం అయ్యారు. ఇదిలా ఉంటే G7 సమ్మిట్‌లో భాగంగా అవుట్‌రీచ్ సెషన్‌లో వాటికన్ సిటీ పోప్ ఫ్రాన్సిస్‌తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోస్ ఫ్రాన్సిస్‌-మోడీ ఆత్మీయ ఆలింగనం చేసుకుని కొద్దిసేపు ముచ్చటించారు.

సదస్సుకు వచ్చిన దేశాధ్యక్షులు, ప్రధానులకు ఆయన గ్రీటింగ్స్ తెలిపారు.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లా చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా బ్రిటీష్ ప్రధాని రిషి సునక్‌తో కూడా ప్రధాని నరేంద్ర మోడీ సంభాషించారు.

ఇదిలా ఉంటే జీ 7 సమ్మిట్‌లో తొలిసారి పోప్ ప్రసంగించనున్నారు. సమావేశంలో వరల్డ్ వైడ్ గా జరుగుతున్న తాజా పరిణామాలను ఉద్దేశించి పోప్ ప్రసంగించనున్నారు.కాగా ఓ పోప్ జీ7 సమ్మిట్కు రావడం ఇదే తొలిసారి.

Read more RELATED
Recommended to you

Latest news