గిన్నెను ముట్టుకుందని దళిత దివ్యాంగురాలిపై వేడి నీళ్లు పోసిన ప్రిన్సిపాల్​

-

ఆహారం వడ్డించే పాత్రకు చేయి తగిలిందని.. దళిత బాలికను కులం పేరుతో దూషించి.. తీవ్రంగా కొట్టాడు ప్రధానోపాధ్యాయుడు. దివ్యాంగ బాలిక అని చూడకుండా వేడి నీటిని ఆమెపై పోశాడు. ఇదేంటని అడగడానికి వచ్చిన బాలిక తండ్రిని సైతం కులం పేరుతో దూషించాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బారాబంకిలో జరిగింది.

టికైత్​నగర్​ పోలీస్ స్టేషన్​ పరిధిలోని ఇచౌలి గ్రామానికి చెందిన దివ్యాంగ బాలిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. రోజు లాగానే ఆగస్టు 29న బాలికను పాఠశాలకు వెళ్లింది. మధ్యాహ్నం భోజనం చేసేందుకు వెళ్లగా.. ఆహరం వడ్డించే పాత్రకు చేయి తగిలింది. దీంతో ఆగ్రహానికి గురైన ప్రధానోపాధ్యాయుడు మహ్మద్​ అమీన్​ కులం పేరుతో దూషించాడు. దాంతో ఆగకుండా వేడి నీరును బాలికపై పోశాడు. చేయి కాలిన బాలిక ఏడుస్తూ వెళ్లి తండ్రికి చెప్పింది.

బాలిక తండ్రి అనంతరం పాఠశాలకు రాగా.. అతడిని సైతం కులం పేరుతో దూషించాడు ప్రధానోపాధ్యాయుడు. దీంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు బాలిక తండ్రి. దీనిపై విచారించిన విద్యాశాఖ అధికారులు.. ప్రధానోపాధ్యాయుడిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అతడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version