విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ .. కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి

-

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అవకాశమే లేదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి స్పష్టం చేశారు. విశాఖ పర్యటనలో ఉన్న ఆయన..వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌ను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… స్టీల్ ప్లాంట్ మీద ఇక్కడ ప్రజలు, ఉద్యోగుల సెంటిమెంట్‌ను నేను గుర్తించాను .ఇక్కడ గమనించిన ప్రతి అంశాన్ని ప్రధాని మోడీకి వివరిస్తాను అని తెలిపారు.విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితులపై ప్రధానికి నోట్ సమర్పిస్తాను అని అన్నారు.ఇక, స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం ఎవరు చెప్పారు..? అని.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశాన్ని ఉక్కు మంత్రి తోసిపుచ్చారు. ఈ ప్లాంట్ దేశ ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుంది అని తెలిపారు. ఈ ప్లాంట్ ను పరిరక్షించడం మా బాధ్యత.. ప్రధాని మోడీ ఆశీస్సులు, సహాయంతో ఈ ప్లాంట్ 100 శాతం సామర్థ్యం తో ఉత్పత్తి చేస్తుందని వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news