సమస్యల నుండి మోడీ దృష్టి మళ్ళిస్తున్నారు: ప్రియాంక గాంధీ

-

ప్రియాంక గాంధీ అధికార బిజెపి పై విమర్శలు చేశారు. బుధవారం కేరళలోని వయనాడులో జరిగిన ర్యాలీలో మాట్లాడారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ బిజెపి నేతల ప్రసంగాలని గమనిస్తే అసంబద్ధమైన అంశాల గురించి మాట్లాడటం తెలుస్తుంది. ప్రజల సమస్యల గురించి అలానే అభివృద్ధి గురించి అసలు సమస్యల గురించి మాట్లాడరు బిజెపి నేతలు ముఖ్యమైన అంశాలని పక్కదారి పట్టించే విధంగా ప్రయత్నం చేస్తున్నారని ప్రియాంక గాంధీ అన్నారు.

ప్రతిరోజు ప్రజలకి సంబంధంలేని అంశాలని తెరమీదకి తీసుకువచ్చి గందరగోళాన్ని సృష్టిస్తున్నారని ప్రియాంక గాంధీ అన్నారు. ప్రజల బాగు గురించి కాకుండా అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతున్నారని ప్రియాంక గాంధీ అన్నారు. ధరల పెరుగుదల నిరుద్యోగం వంటి సమస్యలను పరిష్కరించడంలో మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు ప్రియాంక గాంధీ.

Read more RELATED
Recommended to you

Latest news