పవన్ కళ్యాణ్ పై నాగబాబు ఆసక్తికర ట్వీట్..!

-

ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో పీఠాపురం నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో అందరి దృష్టి పిఠాపురం పైనే పడింది. నిన్న పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. సోదరుడు నాగబాబు, పిఠాపురం టీడీపీ ఇన్ చార్జీ వర్మతో కలిసి రిటర్నింగ్ అధికారులకు తన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఇదిలా  ఉంటే.. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ పై జనసేన నేత నాగబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. “నీ ఉద్దేశం ఏదైనా నీ ఆదేశం ఏదైనా ప్రశ్నించకుండా పాటించే లక్షలమంది జనసైనికుల్లో నేను ఒకడిని. ఎందుకంటే నీ నిర్ణయం నా భుజం మీద నీ చేయి లాంటిది. అది బలాన్ని, భరోసాని ఇస్తుందే తప్ప బరువుని, బాధని ఇవ్వదు” అని పేర్కొన్నారు. ఇక మరోవైపు మెగాస్టార్ రంగంలోకి దిగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి తమ్ముడి గెలుపు కోసం పిఠాపురం నియోజకవర్గంలో చిరంజీవి రెండు రోజులు ప్రచారం నిర్వహిస్తారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news