12 కుట్లు పడినా రవితేజ షూటింగ్ కు వచ్చారు: నిర్మాత

-

రవితేజ లేటెస్ట్ మూవీ “టైగర్ నాగేశ్వరరావు” షూటింగ్ ను పూర్తి చేసుకుని రిలీస్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 20వ తేదీన విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఎక్కడా రాజీ పడకుండా నిర్మించగా, అందుకు తగినట్లే డైరెక్టర్ వంశీ కృష్ణ ఆకెళ్ళ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించారు. కాగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత అభిషేక్ మాట్లాడుతూ ఒక సీన్ షూటింగ్ సమయంలో రవితేజ కు దెబ్బ తగిలి మోకాలికి 12 కుట్లు పడ్డాయి. ఆ దశలో మాములుగా ఎవరైనా షూటింగ్ కు రావాలి అంటే కనీసం 10 నుండి 15 రోజులు ఈజీ గా అవుతుంది. కానీ రవితేజ మాత్రం కుట్లు పడిన రెండు రోజుల్లోనే షూటింగ్ కు వచ్చాడు.

నిర్మాత ఎక్కడ నష్టపోతాడో అన్న ఆలోచనతో తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా షూటింగ్ లో పాల్గొన్నారని నిర్మాత అభిషేక్ అగర్వాల్ రవితేజ గొప్పతనాన్ని తెలియచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news