నయనతార పై వస్తున్న వార్తలకు చెక్ పెట్టిన నిర్మాత ఎన్వి ప్రసాద్..!!

-

స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2003లో మలయాళం చిత్రంతో మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత సౌత్ లోనే లేడీ సూపర్ స్టార్ గా పేరుపొందింది నయనతార.కెరియర్ ప్రారంభంలో ఎక్కువగా కాస్త గ్లామర్ పాత్రలో చేసినప్పటికీ స్టార్ స్టేటస్ అందుకున్న తర్వాత ఇలాంటి వాటికి దూరంగా ఉంది ముద్దుగుమ్మ. ఇక గడిచిన కొన్ని నెలల క్రితం కోలీవుడ్ దర్శకుడు విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకుంది. ఇక వివాహమై న కూడా నయనతార చేతిలో పలు సినిమాలతో తన కెరియర్ చాలా బిజీగా ఉన్నది.

ఇదంతా పక్కన పెడితే నయనతార రెమ్యూనరేషన్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తోందని.. ఫుల్ సెటిల్మెంట్ చేశాకే సినిమా షూటింగ్ కి హాజరవుతుందని గతంలో ఎన్నోసార్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలన్నీటికి పుల్ స్టాప్ పెట్టే విధంగా తాజాగా నిర్మాతలలో ఒకరైన ఎన్వి ప్రసాద్ మాట్లాడడం జరిగింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఈయన నయనతార గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.

ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ.. నయనతార కు డైరెక్టర్ మోహన్ రాజా వల్లే గాడ్ ఫాదర్ సినిమాలో నటించింది. అయితే ఫైనల్ డేట్స్ ఉన్న రోజుల్లో ఆమె సెప్టెంబర్ లో కేవలం ఒక గంటలోనే తన వర్క్ మొత్తం పూర్తి చేసుకుని వెళ్లిపోయింది అని తెలియజేశారు. అయితే నయనతారకు అప్పటికే నిర్మాతలు ఇంకా కాస్త బ్యాలెన్స్ రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి ఉన్నదట. కానీ ఆ విషయాన్ని ఆమె టీం కానీ, ఆమె కానీ ఈ విషయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదట.అప్పుడే అక్కడున్న వారందరికీ నయనతార డబ్బు మనిషి కాదని అర్థమైందని తెలియజేశారు. కేవలం ఆమె వర్క్ విషయంలో మాత్రమే శ్రద్ధ చూపిస్తుందని ఎంతో క్రమశిక్షణతో కలిగి ఉన్నదని ప్రసాద్ తెలియజేశారు. నయనతార పై వస్తున్న వార్తలన్నీ రూమర్లే అని తెలియజేశారు ఎన్వి ప్రసాద్.

Read more RELATED
Recommended to you

Exit mobile version