సీఎం జగన్‌కు, రఘురామకృష్ణంరాజు లేఖ.. అందుకేనట..!

-

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా పేరు పెట్టాలని సీఎం జగన్‌కి ఎంపీ రఘురామకృష్ణంరాజు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు ఎంపీ లేఖ రాశారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన జగన్‌ ఆ సమయంలో ఈ విషయంపై ప్రజలకు హామీ ఇచ్చారని రఘురామకృష్ణరాజు గుర్తుచేశారు.

జిల్లాకు పేరు పెడతామని అధికారికంగా ప్రకటన చేస్తే ప్రజలు ఎంతో సంతోష పడతారని లేఖలో పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం రాసిన లేఖను ఎంపీ క్యారాలయం మీడియాకు విడుదల చేసింది. ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్‌కు వైఎస్సార్‌సీపీ ఎంపీలు రఘురామపై ఫిర్యాదు చేసిన మరుసటి రోజే లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version