రైతు భరోసా నిధులు జమ.. 50 లక్షల మందికి లబ్ది

-

రైతుల ఖాతాల్లో వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ నిధులు జమ అయ్యాయి. కాసేపటి క్రితమే.. ఏపీ సీఎం జగన్‌… రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు.  వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ నిధుల కారణంగా ఏకంగా ఏపీ వ్యాప్తంగా 50 లక్షల మందికి లబ్ది చేకూరనుంది. వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ నిధులతో పాటు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు మరియు వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం నిధులను సీఎం జగన్‌ జమ చేశారు.

Jagan

రైతుల ఖాతాల్లో వర్చువల్ గా నగదు జమ చేశారు సీఎం వైఎస్‌ జగన్‌ ఈ మూడు పథకాల క్రింద రైతుల ఖాతాల్లో ఏకంగా రూ.1,214 కోట్లు జమ చేశారు ఏపీ సీఎం జగన్‌. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రైతు కళ్లల్లో దీపావళి కాంతులు చూసేందుకు నగదు జమ చేస్తున్నామన్నారు. వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద పంట రుణాలు కూడా ఇవాళే రిలీజ్‌ చేస్తున్నామని ప్రకటించారు. తమ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని… రైతులకు ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version