బండి సంజయ్ వ్యక్తి కాదు, శక్తి : రాజా సింగ్

-

తెలంగాణాలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయంగా త్రిముఖ పార్టీల మధ్యన మాటల పోరు ఎక్కువ అవుతోంది. కాంగ్రెస్ మరియు బీజేపీలు BRS ను టార్గెట్ చేస్తూ అధికారాన్ని దక్కకుండా చేయాలన్న ఆలోచనలో ఎవరి వ్యూహాలను వారు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ… బండి సంజయ్ ను ఖచ్చితంగా అసెంబ్లీ కి తీసుకువెళ్ళడానికి నా సర్వశక్తుల్లా ప్రయత్నిస్తాను అంటూ కామెంట్ చేశారు. బండి సంజయ్ వ్యక్తి కాదు శక్తి అంటూ పవర్ ఫుల్ స్టేట్మెంట్ ను ఇచ్చాడు రాజా సింగ్. ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించే బాధ్యతను ప్రజలు తీసుకోవాలని అభ్యర్ధించారు రాజా సింగ్. ఎలాగైనా గెలవడానికి అధికార పార్టీ డబ్బులు పంచడానికి సమాయత్తం అవుతోందంటూ కామెంట్ చేశాడు రాజా సింగ్.

ఒవైసి కి దమ్ముంటే కరీంనగర్ లో ఎంఐఎం అభ్యర్థిని బరిలోకి నిలపాలన్నారు రాజా సింగ్. ఇంకా ఎన్నికలకు 24 రోజులు సమయం ఉండడంతో ప్రచార కార్యక్రమాల్లో వేగాన్ని పెంచుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version