రామ్ చరణ్ కి అరుదైన గౌరవం..!

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి అరుదైన గౌరవం దక్కింది. చెన్నైలోనే ఒక ప్రముఖ యూనివర్సిటీలో ఆయనకి గౌరవ్ డాక్టరేట్ ని ప్రధానం చేస్తున్నారు. ఈనెల 13న చెన్నైలోని వేల్స్ వర్చువల్ యూనివర్సిటీ స్నాతకోత్సవం వేడుకలు జరగబోతున్నాయి ఈ వేడుకలు ని సినీ నిర్మాత యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ అయిన ఈసరి గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారు.

ఈ కార్యక్రమానికి తెలుగు సినీ హీరో రామ్ చరణ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు కళా రంగానికి చేస్తున్న అత్యుత్తమ సేవల్ని గుర్తించి వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టర్ని ప్రధానం చేయబోతోంది ఈ పురస్కారాన్ని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షులు డిసి సీతారాం రామ్ చరణ్ కి అందజేయబోతున్నారు తమ హీరోకి సినిమా రంగంలోకి వచ్చిన కొన్నేళ్లలోనే అరుదైన గౌరవం దక్కడం పట్ల సంతోషంగా ఉన్నారు, అభిమానులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version