తెలంగాణ రాష్ట్రం రూపుదాల్చి పదేళ్లు అవుతోంది : రామ్‌ చరణ్‌

-

తెలంగాణా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. బంగారు తెలంగాణ కల నిజం చేసుకుంటున్నాం అంటూ ట్వీట్ చేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్). జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపాడు రామ్ చరణ్. తెలంగాణ రాష్ట్రం రూపుదాల్చి పదేళ్లు అవుతోందని, ఈ పదేళ్లలో ఎంతో పురోగతి సాధ్యమైందని తెలిపారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి బంగారు తెలంగాణ కల నిజం చేసుకుంటున్నామని రామ్ చరణ్ పేర్కొన్నారు. దశాబ్ది వేడుకల సందర్భంగా తెలంగాణ సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు చెబుతున్నానని వెల్లడించారు.

ఇక తెలంగాణ రాష్ట్రం పదో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట ప్రభుత్వం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. 21 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో రోజుకో రంగం చొప్పున ప్రత్యేక కార్యక్రమాలతో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం. పార్లమెంటు ఉభయ సభలలో బిల్లు ఆమోదం తర్వాత 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన సంగతి తెలిసిందే.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version