వ్యూహం సినిమాను బాత్రూమ్ లో చూడమంటూ బాబు, పవన్ లపై రామ్ గోపాల్ వర్మ సెటైర్

-

వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వ్యూహం’.పట్టు వదలని విక్రమార్కుడిలా తరచూ టీడీపీ అండ్ కో మీద సెటైర్లు వేసే రామ్ గోపాల్ వర్మ మరోసారి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.వ్యూహం మూవీ మీద విష ప్రచారం చేస్తున్న తెలుగు దేశం పార్టీ, జనసేన కార్యకర్తలు ఈ సినిమాను బాత్రూమ్ లో కూర్చొని చూడాలంటూ కామెంట్ చేశాడు.బూతు సినిమాలు చూడాలని అందరికీ కోరిక ఉంటుందని, కాని థియేటర్లో తెలిసిన వారుంటారేమోనన్న భయంతో వెళ్లరని, వ్యూహం చిత్రం విషయంలో తెలుగు దేశం పార్టీ, జనసేన కార్యకర్తలకు అలాంటి భయం అవసరం లేదని నిశ్చింతగా బాత్రూమ్ లో కూర్చొని చూడండంటూ కామెంట్ చేశాడు.

 

ఇక రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాల్లో వైయస్ జగన్ పాత్రలో తమిళ నటుడు అజ్మల్ నటిస్తుండగా, తన భార్య వైఎస్ భారతి పాత్రలో మానస నటిస్తుంది.సినిమాలో వైఎస్సార్ మరణం ఆ తర్వాత జరిగే ఓదార్పు యాత్ర.. జగన్ జైలు ప్రయాణం.. బెయిల్ పై వచ్చి పాదయాత్ర మొదలుపెట్టడం.. మొదలగు అంశాలపై ఈ సినిమా రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news