హైద‌రాబాద్‌లో దారుణం.. బాలికపై అత్యాచారం ఆపై వ్య‌భిచారం

-

హైద‌రాబాద్ లోని పాతబ‌స్తీ లో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో వాళ్ల‌తో గొడ‌వ ప‌డి అర్థ‌రాత్రి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఒక బాలికపై కొంద‌రు దాడి చేశారు. అంతే కాకుండా ఆ బాలికపై అత్యాచారం చేశారు. వీటితో ఆగ‌కుండా ఆ బాలిక‌ను వ్య‌భిచార కూపీలోకి దించారు. ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ లోని పాతబ‌స్తీలో చోటు చేసుకుంది. అయితే హైద‌రాబాద్ లోని పాత బ‌స్తీ కిష‌న్ బాగ్ ప్రాంతానికి చెందిన ఒక బాలిక త‌న ఇంట్లో వాళ్లో గొడ‌వ ప‌డి న‌వంబ‌ర్ 20 న బ‌య‌ట‌కు వ‌చ్చింది. బాలిక జాడ తెలియ‌క పోవ‌డం తో డిసెంబ‌ర్ 1 న త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

అయితే బాలిక స‌మాచారం తెలుసుకున్న పోలీసులు ఒక ఇంటిపై దాడి చేశారు. అక్కడ ఉన్న బాలిక‌ను కాపాడారు. వారిని విచారంచ‌గా అసలు నిజం బ‌య‌ట ప‌డింది. నవంబ‌ర్ 20 బ‌య‌ట‌కు వ‌చ్చిన బాలిక‌ను ఒక ఆటో డ్రైవ‌ర్ స‌మీర్ తో పాటు అత‌ని స్నేహితుడు హ‌ఫీజ్ ఇద్ద‌రు క‌లిసి బాలికపై అత్యాచారం చేశారు. అంతే కాకుండా న‌గ‌రంలోని మైలార్ దేవ్ ప‌ల్లి లో మ‌రో ఇద్ద‌రు మ‌హిళల సాయంతో ఒక ఇంట్లో ఉంచి వ్య‌భిచారం చేయించారు. బాలిక‌కు మ‌త్తు మందు ఇచ్చి వ్య‌భిచారం చేయించార‌ని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version