ముంబై ప్రజలకు రతన్ టాటా కీలక విజ్ఞప్తి

-

ఐదవ విడుతలో భాగంగా ముంబైలోని అన్ని నియోజకవర్గాలకు మే 20న పోలింగ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో పారిశ్రామికవేత్త రతన్ టాటా ముంబై ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు.సోమవారం ముంబైలో ఓటింగ్ రోజు.ముంబై వాసులంతా బాధ్యతతో ఓటేయాలని రతన్ టాటా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.ఐదో దశలో దేశంలోని 49 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

అలాగే బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ట్వీట్ చేశారు. ‘బాధ్యతాయుతమైన భారతీయ పౌరులుగా మనం ఈనెల 20న మహారాష్ట్రలో మన ఓటు హక్కును వినియోగించుకుందాం. భారతీయులుగా మన కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం. మన దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఓటు వేద్దాం. ఓటు వేయడం మన హక్కు. అందరికీ తెలియజేయండి’ అని పిలుపునిచ్చారు.ముంబైలోని పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ కూడా ముంబై ప్రజలను బయటకు వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news