సామాన్యులకు బిగ్ షాక్..వడ్డీ రేట్లను భారీగా పెంచిన RBI

-

సామాన్యులకు బిగ్ షాక్ ఇచ్చింది RBI. వడ్డీ రేట్లను భారీగా పెంచుతూ కీలక ప్రకటన చేసింది RBI. వాణిజ్య వర్గాలు, విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ఆర్బీఐ ఈ సారి వడ్డీ రేట్లను 35 బేసిస్‌ పాయింట్ల మేర పెంచేసింది.

వాణిజ్య వర్గాలు, విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈసారి వడ్డీ రేట్లు 35 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో రేపో రేటు 6.25 శాతానికి చేరింది. సోమవారం ప్రారంభమైన ద్రవ్యపరపతి కమిటీ సమావేశ నిర్ణయాలను ఆర్బిఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేడు ప్రకటించారు. ధ్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే సంకేతాలు కనిపించడం, ఆర్థికవృద్ధి నెమ్మదించడంతో రేట్ల పెంపు వేగాన్ని ఈసారి ఆర్బిఐ కాస్త తగ్గించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version