నాగపూర్ లో నివాసం ఉంటున్న జో బిడెన్ బంధువులు…!

-

భారతదేశంలో జో బిడెన్ బంధువులు కొందరు ఉన్నారు అని జాతీయ మీడియా పేర్కొంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ 2013 లో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు. 1873 నుండి మహారాష్ట్రలోని నాగ్పూర్ నగరంలో తమ బంధువులు నివసిస్తున్నారని పేర్కొన్నారు. అప్పటి అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న బిడెన్ 2013 లో ముంబైలో ఉన్నప్పుడు, అక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో తన దూరపు బంధువులు కొందరు భారతదేశ ముంబైలో ఉన్నారని కూడా చెప్పారు.

2013 లో ముంబై కార్యక్రమంలో మరియు 2015 లో వాషింగ్టన్ లో జరిగిన మరొక కార్యక్రమంలో వెల్లడించారు. ఆయన తాత ఒకరు ఈస్ట్ ఇండియా కంపెనీలో సేవలు అందించారు. జో బిడెన్ ఉపాధ్యక్షుడు అయిన సమయంలో నాగపూర్ నుంచి ఒక లేఖ వెళ్ళింది. ఈ లేఖను నాగ్‌పూర్‌ కు చెందిన లెస్లీ బిడెన్ రాశారు. ఆయన మనవరాళ్లు నాగ్‌పూర్‌ లోనే ఉన్నారు. వారి కుటుంబం 1873 నుండి ఇక్కడ నివసిస్తున్నట్లు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version