ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. భారత్ చేజారిన తొలి ర్యాంకు!

-

టీమిండియా కు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. ఐసీసీ టెస్టు జట్లు ర్యాంకింగ్స్‌ తాజాగా ఐసీసీ రిలీజ్‌ చేసింది. అయితే.. ఈ ర్యాంకింగ్స్‌ లో టీమిండియా మొదటి స్థానాన్ని కోల్పోయింది. ఈ జాబితాలో.. యాషెస్‌ సిరీస్‌ లో భాగంగా ఇంగ్లండ్‌ పై ఘన విజయం సాధించిన ఆసీస్‌ జట్టు మొదటి స్థానాన్ని దక్కించుకుంది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా 2-1 తేడాతో టెస్టు సిరీస్‌ కోల్పోయిన టీమిండియా.. ర్యాంకింగ్స్‌ లో మూడో స్థానానికి పడి పోయింది.

గతేడాది ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ను సొంతం చేసుకున్న న్యూజిలాండ్ జట్టు… ప్రస్తుతం 117 రేటింగ్ పాయింట్స్‌ తో రెండో స్థానంలో ఉంది. ఇంగ్లండ్‌ నాలుగో స్థానం తో సరిపెట్టు కుంది. భారత్‌ పై విజయం అనంతరం.. దక్షిణాప్రికా తన స్థానాన్ని మెరుగుపరుచుకుని…ఐదో స్థానానికి ఎగబాకేసింది. దీం తో పాకి స్థాన్‌ జట్టు.. ఆరో స్థానానికి పడి పోయింది. శ్రీలంక, వెస్టిండీస్‌, జింబాబ్వే తమ స్థానాలను సుస్థిరం చేసేసుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version