తెలంగాణ ప్రభుత్వానికి ఊరట..ఎన్జీటీ విధించిన రూ.900 కోట్ల జరిమానాపై సుప్రీంకోర్టు స్టే

-

తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన సుప్రీంకోర్టు.. గతంలో ఎన్జీటీ విధించిన రూ.900 కోట్ల జరిమానాపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పాలమూరు-రంగారెడ్డి “తాగునీటి ప్రాజెక్టు” పనులు కొనసాగించేందుకు అనుమతి మంజూరు చేసింది సుప్రీం కోర్టు. జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ ఎమ్.ఎమ్. సుందరేష్ లతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు.

పాలమూరు-రంగారెడ్డి తాగునీటి ప్రాజెక్టు కు ఆమోదం తెలిపిన సుప్రీంకోర్టు… గతంలో ఎన్.జి.టి విధించిన 900 కోట్ల రూపాయల జరిమానా పై స్టే విధించింది. “తాగునీటి” ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని 2006 లో కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. 2006 వ సంవత్సరం, సెప్టెంబర్ నెలలో కేంద్ర పర్యావరణ శాఖ జారీ చేసిన “పర్యావరణ ప్రభావ అంచనా ప్రకటన” ( Environment Impact Assessment Notification) లో స్పష్టం చేసిన అంశాలను ఆధారం చేసుకుని వాదనలు వినిపించింది తెలంగాణ ప్రభుత్వం. “రిజర్వాయర్ లెవల్” వరకు నిర్మాణ పనులు కొనసాగేందుకు అనుమతులు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version