మా పార్టీ ఓడి పోవటానికి మీడియానే ప్రధాన కారణం : రేవంత్

-

కేంద్రం నుండి  బీజేపీ అగ్ర నేతలు దేశం నలుమూలల నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెరాస తరుపున గల్లీలో మంత్రి తిరిగాడని, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఒక రకంగా సర్వశక్తులు కుమ్మరించి స్థానికం గా గెలవాలని ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేసిన ప్రతి కార్యకర్త కు నమస్కారాలు అని పేర్కొన్న ఆయన మీడియా ఈ సారి తనవంతు పాత్ర పోషించలేదని అందుకే తెలంగాణలో ప్రతి రాజకియ పార్టీ ఒక ఛానెల్ పెట్టలసిన అవసరం ఏర్పడింది దీని వలన ప్రజా స్వామ్యం మీద నమ్మకం పోతుందని అన్నారు.

revanth_reddy

మా పార్టీ ఒడి పోవటానికి మీడియానే ప్రధాన కారణం అని అయన అన్నారు. ప్యాకేజీ ఇవ్వలేక ఒడిపోయామని ఆయన అన్నారు. తెరాస బిజెపి పార్టీలు మీడియా సంస్థలకు డబ్బులు ఇచ్చి సీట్లు  గెలిచాయని అన్నారు. 2016 లో 10.4 శాతం ఓట్లు వచ్చినా వాటిని ఎక్కడ చెప్పలేదు ఎంత సేపు బీజేపీ భజన చేస్తున్నారని 2016 కంటే మేము మెరుగైన ఫలితాలు సాదించామని ఓటు బ్యాంక్ దాదాపు 4 శాతం పెరిగిందని ఆయన అన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version