మునుగోడు ప్రచారానికి వెళ్తా..కాంగ్రెస్‌ గెలుపునకు పనిచేస్తా – జగ్గారెడ్డి

-

మునుగోడు ఉప ఎన్నికపై TPCC వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఎవరు పిలిచినా పిలవకున్న మునుగోడు ప్రచారానికి వెళ్తా..నా తరపున కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేస్తానని తేల్చి చెప్పారు. నా దగ్గర ఉన్న మెడిసిన్ త్వరలోనే బయటికి తీస్తానని.. వెంకట్ రెడ్డిని అధిష్టానం పిలిచి బుజ్జగిస్తే గెలుపు కోసం పని చేస్తాడని వివరించారు.

కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరు హోమ్ గార్డులు కాదు, IPS లు కాదని.. మేమంత సైనికులం..అధిష్టానం మాకు బాస్ అని తెలిపారు.బండి సంజయ్ కోతల రాయుడని.. దుబ్బాకలో ఈ సారి బిజెపి గెలవదని కుండ బద్దలు కొట్టి చెప్పారు. ఈటల కూడా హుజురాబాద్ లో ఒడిపోతానన్న భయంతో గజ్వెల్ నుంచి పోటీచేస్తా అని చెబుతున్నాడని… ఈటలకి ఓటమి భయం పట్టుకుందని చురకలు అంటించారు. ప్రియాంక గాంధీ మాకు ఇంచార్జ్ గా వస్తే నేను హ్యాపీ అని.. వెల్లడించారు TPCC వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version