కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విజయం సాధించడం ఖాయం : సిద్దరామయ్య

-

తెలంగాణ సీఎం కేసీఆర్ పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి సిద్ధరామయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. రేవంత్ రెండు చోట్ల విజయం సాధిస్తారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.

సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో అవినీతి రాజ్యం ఏలింది. ఆయనను ఓడించాలని తెలంగాణ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఓటుతో కేసీఆర్ ను ఇంటికి పంపించాలని ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు అమలు కావడం లేదని సీఎం కేసీఆర్ అంటున్నారు.. కేసీఆర్.. కర్ణాటకకు వచ్చి ఒకసారి చూడండి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు 6 గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version