రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన… అమిత్ షా పై కేసు కొట్టివేత !

-

ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘించారనే కారణంతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పై నమోదైన కేసును శనివారం చార్మినార్ పరిధిలోని మొఘల్ పురా పోలీసులు ఉపసంహరించారు. ఉద్దేశపూర్వకంగా కోడ్ ఉల్లంఘన జరగలేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు వివరించారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనంతరం కీలక పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.

మే 1వ తేదీన పాతబస్తీలో హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతకు మద్దతుగా అమిత్ షా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సభలో మాధవి లత మాట్లాడుతుండగా.. వేదికపైకి ఇద్దరు బాలికలు వచ్చారు. అమిత్ షా ఆ చిన్నారులను తన వద్దకు రమ్మంటూ సైగ చేయడంతో.. ఆ చిన్నారులు షా వద్దకు వెళ్లారు. ఓ చిన్నారి చేతిలో ఉన్న బ్యానర్‌పై కమలం పువ్వు గుర్తు.. మరో ఇద్దరు చిన్నారుల చేతిలో ఆప్ కీ బార్ 400 సీట్లు అనే ప్లకార్డ్స్ ఉన్నాయి. అయితే అమిత్ షాతో పాటు కిషన్ రెడ్డి పేర్లను ఉపసంహరించుకున్నారు పోలీసులు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనంతరం.. ఎన్నికల ప్రచారంలో అమిత్ షా ఉద్దేశపూర్వకంగా కోడ్ ఉల్లంగించలేదని కేసు ఉపసంహరణ చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version