చంద్రబాబు: జగన్ పాలనతో రాష్ట్రం రివర్స్ గేర్ లో..!

-

అన్ని రంగాలను కూడా సీఎం జగన్ రివర్స్ గేర్ లో పెట్టారని ఆయన మాత్రం దేశంలో అత్యంత ధనవంతుడిగా అయ్యారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు వైకాపా ప్రభుత్వ పాలనలో పేదలు సంక్రాంతి పండుగను కూడా చేసుకోలేని పరిస్థితి వచ్చిందని అన్నారు. తెదేపా అధికారం లో ఉన్నప్పుడు పండుగ సమయంలో ఉచితంగా సరుకులు ఇచ్చినట్లు గుర్తు చేశారు. చంద్రబాబు తమ హయాంలో పేదల కోసం అన్న క్యాంటీన్లను తీసుకువచ్చి ఐదు రూపాయలకే కడుపు నింపామని చెప్పారు.

విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహించిన రా కదిలి రా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. పేదల బలహీనతని ఆసరా చేసుకుని వైసీపీ దోచుకుంటుందని అన్నారు. అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధమని జగన్ చెప్పారని నిషేధం చేయకపోతే ఓట్లు అడగను అన్నారు. ఇవాళ అనేక రకాల మద్యం తీసుకువచ్చి పేదలని దోచుకుంటున్నారని జగన్ అప్పుల పాపారావు అని అన్నారు. రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారని పిల్లలకి దాన్ని అలవాటు చేశారని చెప్పారు. చంద్రబాబు గంజాయి నిర్మూలనపై ఒక్కరోజైనా సీఎం సమీక్ష నిర్వహించారు అని అడిగారు

Read more RELATED
Recommended to you

Latest news