సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

-

సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఖమ్మం జైలు లో ఆడబిడ్డల పట్ల అమానుషంగా ప్రవర్తించి మానవ హక్కుల ఉల్లంఘన చేసిన అధికారుల పై చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో రేవంత్ రెడ్డి కోరారు. సెప్టెంబర్ 17 లోగా రాష్ట్రంలోని పోడు భూముల అన్నింటికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి దళిత, గిరిజన, ఆదివాసీ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్‌ చేశారు.

గిరిజన, ఆదివాసీ జీవితాల్లో వెలుగు నింపిన ఐటీడీఏలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాం లో శిథిలావస్థకు చేరుకున్నాయని నిప్పులు చెరిగారు. తక్షణం వాటిని పునరుద్ధరించే విధంగా నిధులు విడుదల చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్‌ చేశారు. అప్పటి వరకు దళిత – గిరిజన ఆత్మగౌరవ దండోరాలతో ప్రజాక్షేత్రంలో కేసీఆర్‌ సర్కార్‌ పై పోరును మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఇక నైనా తెలంగాణ ప్రభుత్వం తన బుద్దిని మార్చు కోవాలని హితువు పలికారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version