ఆసియా కప్‌ 2022 లో టీమిండియా శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌ లో టీమిండియా.. 5 వికెట్ల తేడాతో పాక్‌ పై గెలిచింది. మొదట పాకిస్తాన్‌ 19.5 ఓవర్లలో 147 పరుగుల వద్ద ఆలౌట్‌ కాగా.. ఇండియా ఆ లక్ష్యాన్ని 5 వికెట్ల తేడాతో ఛేదించింది.పాక్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ రిజ్వాన్‌ 43 పరుగులు చేసి.. రాణించారు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టి20లో అరుదైన ఘనత సాధించాడు. టి20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గఫ్టీల్ ను అధిగమించి రోహిత్ శర్మ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆసియా-2022 లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ ఈ ఘనతను అందుకున్నాడు.