షర్మిలకు రాజకీయ అవగాహన లేదు.. అందుకే విషం చిమ్ముతోంది: రోజా

-

రాజకీయ అనుభవం లేని షర్మిల రెండు పార్టీల మధ్య పావుగా మారిందని జగనన్న పై విషం చిమ్ముతోందని మంత్రి ఆర్కే రోజా అన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం ఆమె దర్శించుకున్నారు. తర్వాత ఆలయ వెలుపలికి వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు. డీఎస్సీ పై వస్తున్న ఆరోపణల పై స్పందించారు చంద్రబాబు నాయుడు డిఎస్సి ల ద్వారా ఇవ్వాల్సిన 17వేల భర్తీలను జగన్మోహన్ రెడ్డి భర్తీ చేశారని అన్నారు.

roja fire on ap opponents

మరో 6000 భర్తీలకి నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పారు నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో లేకుండా తెలంగాణ వెళ్లి నేను తెలంగాణ బిడ్డని తెలంగాణకి అండగా ఉంటానని చెప్పిన ఆమె ఈరోజు జగనన్న పై విషం చిమ్ముతోందని ధ్వజమెత్తారు. షర్మిల కి రాజకీయ అవగాహన లేదనడానికి నిన్న ఆమె చేసిన హడావిడి చూస్తేనే అర్థమవుతుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news