చంద్రబాబు ముసలి నాయకుడు..మూలకు కూర్చోవాల్సిందే – మంత్రి రోజా

-

చంద్రబాబు ముసలి నాయకుడు..మూలకు కూర్చోవాల్సిందేనని చురకలు అంటించారు ఏపీ మంత్రి రోజా. ప్రజలు మా ప్రభుత్వ పాలన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం అని.. జగన్ ను ప్రజలు ఎలా అభిమానిస్తున్నారో మాకు వస్తున్న స్పందన చూస్తేనే అర్థం అవుతుందని వివరించారు. ప్రజల ఇంటికే వాలంటీర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు వెళుతున్నారని చెప్పారు రోజా.

మీకు ఇంకా ఏం సమస్యలు ఉన్నాయని ప్రజలనే నేరుగా అడుగుతున్నారని.. ఏడు లక్షల మంది జగన్ సైనికులు క్షేత్ర స్థాయిలో ప్రతి ఇంటికి వెళుతున్నారని పేర్కొన్నారు. 63 లక్షల 93 వేల మంది ఇళ్ళకు మా సైనికులు వెళ్లారన్నారు. జగన్ స్టిక్కర్లు చూస్తే చంద్రబాబు గుండెల మీద ఎవరో ఎగిరి ఎగిరి కొట్టినట్లు ఉంటోందని ఫైర్‌ అయ్యారు. కొంత మంది దొంగతనంగా వెళ్లి స్టిక్కర్లు పీకేస్తున్నారని.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏం చేశారో చెప్పగలరా అని సవాలు విసురుతున్నానన్నారు. చంద్రబాబు దిగుతున్నది సెల్ఫీలు కాదు సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు.. మూలన కూర్చోకుండా ఇంకా కుట్రలు పన్నుతున్నాడని ఆగ్రహించారు రోజా.

Read more RELATED
Recommended to you

Exit mobile version