పాపం సోమిరెడ్డి….

-

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయత్ర ముగింపు సభలో వచ్చిన జనాల గురించి  ఏపీ మంత్రి సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత రోజా సంచలన కామెంట్స్ చేశారు. జగన్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అసలు జనాలే రాలేదన్నారు. దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రోజా.. అవును మరీ…అదే మీటింగ్ కి సోమిరెడ్డి వస్తే బాగుండేది తొక్కి నలిపేసేవారు అంటూ వ్యాఖ్యానించారు. అసలు ఇంత వరకు ప్రజల మధ్యలో గెలవకుండానే దొడ్డి దారిలో మంత్రి పదవి చేపట్టిన ఆయనకు ప్రజల గురించి ఏం తెలుసు అంటూ విమర్శించారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి, చంద్రబాబు పాలనను ఎండగట్టడానికి మరో ప్రస్థానంలా ప్రజా సంకల్ప పాదయాత్ర సాగిందని అన్నారు.

గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. యాత్రను దిగ్విజయంగా పూర్తిచేసుకున్న వైఎస్‌ జగన్‌ నేడు స్వామివారి దర్శనం కోసం కాలినడకన తిరుమల వస్తున్నారని తెలిపారు. ప్రజా సంకల్పం అందించిన స్ఫూర్తితో విజయసంకల్పం చేశారని..ఇక చంద్రబాబుకి పరాజయమే అంటూ ఆమె పేర్కొన్నారు. రోజా వ్యాఖ్యలతో నెటిజన్లు సైతం స్పందిస్తూ..పాపం సోమిరెడ్డి అనవసరంగా రచ్చరచ్చ చేసుకుంటున్నాడు..అంటూ సెటైర్లు విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news