చంద్రబాబు ఈ రాష్ట్రానికి సైతాన్ : మంత్రి రోజా

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు బాగా వేడెక్కాయి. అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ 2024 లో రానున్న ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నారు. తాజాగా పర్యాటకశాఖ మంత్రి రోజా టీడీపీ మరియు చంద్రబాబును తీవ్రంగా విమర్శించారు. ఈమె మాట్లాడుతూ దమ్ముంటే టీడీపీ మరియు జనసేన నాయకులు ఇంటింటికీ వెళ్లి ఇంతకు ముందు ప్రజలకు ఏమి చేశారో చెప్పాలని అడిగారు. రాష్ట్రానికి లాభం చేయకపోగా.. ఓటుకు నోటు అని అప్రజాస్వమ్య పనులను చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఫైర్ అయ్యారు.

ఇప్పుడు జగనన్న అధికారంలోకి వచ్చి దేశంలో ఎక్కడా చేయని విధంగా సంక్షేమ పాలనను అందిస్తుంటే.. దానికి కూడా టీడీపీ అడ్డుపడుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన సైతాన్ ఈ చంద్రబాబు అన్నారు. ఇంకో పది నెలల కాలంలో వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ భారీ మెజారిటీతో గెలిచి మళ్ళీ జగనన్న సీఎం అవుతారని మంత్రి రోజా చెప్పారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version