దివ్యాంగులకు రూ.6వేల పెన్షన్: చంద్రబాబు

-

పామర్రులో టీడీపీ ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ…మీలో మీరు కొట్టుకోవడం కాదని జగన్మోహన్ రెడ్డిని ఈ ఎన్నికల్లో తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.కౌలు రైతులు, రైతు కూలీలను ఆదుకునేలా కార్పొరేషన్ పెట్టి బాధ్యత తీసుకుంటామని తెలిపారు. యువతలో ఉన్న ప్రతిభను గుర్తిస్తూ తగిన ఉపాధి చూపుతామని హామీ ఇచ్చారు. ఈ ఐదేళ్లల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. జాబ్ క్యాలెండర్‌ లేదు, మెగా డీఎస్సీ లేదని ఆయన మండిపడ్డారు. యువతలో ఉన్న ఆవేశం అవినీతి పాలనను సాగనంపాలని ఆయన అన్నారు.

తాము అధికారంలోకి వస్తే దివ్యాంగులకు రూ.6వేల పెన్షన్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. పలువురు దివ్యాంగులు తమను కలిసిన సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘వైసీపీ పాలనలో దివ్యాంగులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మేం అధికారంలోకి రాగానే దివ్యాంగులకు అండగా ఉంటాం. సాధారణ పెన్షన్లు కూడా నెలకు రూ.4వేలకు పెంచుతాం. మహిళలకు నెలకు రూ.1500 అందిస్తాం. ఇంట్లో ఎంతమంది ఉన్నా.. అందరికీ ఇస్తాం’ అని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version