ఆర్టీసీ బస్సు బోల్తా..15 మందికి తీవ్ర గాయాలు

-

దేశంలో రోడ్డు ప్ర‌మాదాలు రోజు రోజు కు పెరిగి పోతున్నాయి. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎన్ని క‌ఠిన నియ‌మ నిబంధ‌నాలు తీసువ‌చ్చిన‌ప్ప‌టికీ… రోడ్డు ప్ర‌మాదాలు విప‌రీతంగా చోటు చేసు కుంటునే ఉన్నాయి. అయితే.. తాజాగా నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్ర‌మాదంలో ఏకంగా 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘ‌ట‌న ఇవాళ ఉద‌యం 5 గంట‌ల స‌మ‌యంలో జ‌రిగిన‌ట్లు స‌మాచారం అందుతోంది.

ఈ సంఘ‌ట‌న వివ‌రాల్లోకి వెలితే… కర్ణాటక రాష్ట్రం సేడం నుండి నారాయణపేటకు చేస్తున్న ఓ ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. దీంతో ఆర్టీసీ బస్ లో ప్రయాణిస్తున్న 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. నారాయణపేట మండలం ఎక్లాస్ పూర్ సమీపంలో ఘటన చోటు చేసుకుంది. అయితే.. ఈ సంఘ‌ట‌న జ‌రుగ‌గానే.. అక్క‌డి స్థానికులు అల‌ర్ట్ అయి.. క్ష‌త గాత్రుల‌ను ఆస్ప‌త్రి కి త‌ర‌లించారు. ఇక ఈ సంఘ‌ట‌న పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version